ఆ మంత్రికి అందిన ముడుపులు ఎంత?: చింతా మోహన్

ABN , First Publish Date - 2022-02-17T23:44:44+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ తీవ్రస్థాయిలో

ఆ మంత్రికి అందిన ముడుపులు ఎంత?: చింతా మోహన్

ప్రకాశం: వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణపట్నంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎందుకు అమ్ముతున్నారో సమాధానం చెప్పాలన ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ కేంద్రం అమ్మకంలో విద్యుత్ శాఖ మంత్రికి అందిన ముడుపులు ఎంత అని ఆయన నిలదీశారు. ఏపీలో జిల్లా కలెక్టర్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. బకాయిలు పెరిగి కలెక్టర్ల కార్లకు పెట్రోల్ కూడా కొట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైసీపీ.. దళిత వ్యతిరేక ప్రభుత్వమని ఆయన అన్నారు. ప్రభుత్వం దళితుల స్కాలర్‌షిప్‌లను పక్కదారి పట్టించిందని ఆయన ఆరోపించారు. 


Updated Date - 2022-02-17T23:44:44+05:30 IST