‘దేశంలో టెక్నాలజీ తీసుకువచ్చింది రాజీవ్’

ABN , First Publish Date - 2022-05-21T17:21:27+05:30 IST

దేశంలో టెక్నాలజీ తీసుకువచ్చింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

‘దేశంలో టెక్నాలజీ తీసుకువచ్చింది రాజీవ్’

హైదరాబాద్: దేశంలో టెక్నాలజీ తీసుకువచ్చింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎల్‌టీటీ, ఇతర భధ్రతా పరమైన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కున్న వ్యక్తి అని కొనియాడారు. హ్యూమన్ రీసోర్సెస్ మంత్రిత్వ శాఖను సృష్టించింది రాజీవ్ అని చెప్పుకొచ్చారు. జాతి సమైక్యత కోసం రాజీవ్ గాంధీ దేశం మొత్తం సద్బావన యాత్ర చేశారన్నారు. కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. రాష్ట్రాల పర్యటన కేసీఆర్ వ్యక్తి గతమని... కానీ రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నకిలీ విత్తనాలు, రుణాలు ఇతర సమస్యల పరిష్కారం చూపి..దేశంలో పర్యటన చేస్తే బాగుంటుందని హితవుపలికారు.

Updated Date - 2022-05-21T17:21:27+05:30 IST