Bhadradri: ఆస్పత్రిలో రామకృష్ణ కూతురిని పరామర్శించిన భట్టివిక్రమార్క

ABN , First Publish Date - 2022-01-04T18:35:01+05:30 IST

కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ కూతురు సాహితిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరామర్శించారు.

Bhadradri: ఆస్పత్రిలో రామకృష్ణ కూతురిని పరామర్శించిన భట్టివిక్రమార్క

భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ కూతురు సాహితిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్రరావు బెదిరింపులు తట్టుకోలేక రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ శాసనసభపక్షాన ఖండిస్తున్నట్లు తెలిపారు. 90 శాతం కాలిన గాయాలతో మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని... బాలికకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నామన్నారు. ఈ ఘటన చూసి మనసున్న ప్రతీ ఒక్కరు చలించిపోతున్నారని అన్నారు. వనమా రాఘవ దౌర్జనాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని మండిపడ్డారు. అధికార పార్టీకి ప్రభుత్వ యంత్రాంగం వత్తాసు పలకడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. వనమా రాఘవపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. వనమా రాఘవపై గతంలో ఉన్న కేసులు అన్నింటిపై చర్యలు తీసుకోవాలని మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-04T18:35:01+05:30 IST