రియల్‌ ఎస్టేట్‌ మాఫియాగా టీఆర్ఎస్‌: బెల్లయ్య నాయక్‌

ABN , First Publish Date - 2022-01-23T02:31:37+05:30 IST

రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ మాఫియాగా టీఆర్ఎస్‌ మారిందని కాంగ్రెస్ నేత బెల్లయ్య

రియల్‌ ఎస్టేట్‌ మాఫియాగా టీఆర్ఎస్‌: బెల్లయ్య నాయక్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ మాఫియాగా టీఆర్ఎస్‌ మారిందని కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్‌ ఆరోపించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ ధరణి కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూప్రక్షాళన పేరుతో పేదలకు ఇచ్చిన భూములు లాక్కునే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. 30 శాతం భూములు ధరణి వల్ల వివాదాస్పదం అయ్యాయని ఆయన తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ఉద్యమం చేస్తుందని బెల్లయ్య నాయక్‌ ప్రకటించారు. 


Updated Date - 2022-01-23T02:31:37+05:30 IST