రియల్ ఎస్టేట్ మాఫియాగా టీఆర్ఎస్: బెల్లయ్య నాయక్
ABN , First Publish Date - 2022-01-23T02:31:37+05:30 IST
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియాగా టీఆర్ఎస్ మారిందని కాంగ్రెస్ నేత బెల్లయ్య
హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియాగా టీఆర్ఎస్ మారిందని కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ ఆరోపించారు. గాంధీభవన్లో కాంగ్రెస్ ధరణి కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూప్రక్షాళన పేరుతో పేదలకు ఇచ్చిన భూములు లాక్కునే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. 30 శాతం భూములు ధరణి వల్ల వివాదాస్పదం అయ్యాయని ఆయన తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ఉద్యమం చేస్తుందని బెల్లయ్య నాయక్ ప్రకటించారు.