వరద సహాయక పనులలో కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి: Bhatti

ABN , First Publish Date - 2022-07-15T18:25:09+05:30 IST

వరద సహాయక పనులలో కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

వరద సహాయక పనులలో కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి: Bhatti

హైదరాబాద్: వరద సహాయక పనులలో కాంగ్రెస్ (Congress) శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Batti vikramarka) పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ప్రెస్‌నోట్ విడుదల చేశారు. బాధితులకు నిరంతరం అండగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో వరదల తీవ్రత భయంకరంగా ఉందన్నారు. ప్రజలు ఆస్తులు, పంటలు, ఇళ్లు అన్ని కోల్పోయి నష్టాల్లో ఉన్నారని అన్నారు. ప్రభుత్వాలు వరద అంచనాలు, ముందస్తు జాగ్రత్తలు, ప్రజా అవసరాలు తీర్చడంలో విఫలం అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా సేవలో సైనికులు లాగా పని చేసి ప్రజల అవసరాలు తీర్చాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. 


Updated Date - 2022-07-15T18:25:09+05:30 IST