కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్కు కోవిడ్-19 పాజిటివ్
ABN , First Publish Date - 2020-10-01T22:02:18+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయింది. ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయింది. ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
అహ్మద్ పటేల్ గురువారం ఇచ్చిన ట్వీట్లో తనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో తనతో కలిసి సంచరించినవారు స్వీయ ఐసొలేషన్లో ఉండాలని కోరారు.
ఇదిలావుండగా మన దేశంలో కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకునేవారి సంఖ్య పెరుగుతోంది. రికవరీ రేటు 83.53 శాతం ఉన్నట్లు వెల్లడైంది. మార్చి 25న అష్ట దిగ్బంధనం విధించినప్పటి నుంచి అక్టోబరు 1 వరకు ఈ రికవరీ రేటు నెమ్మదిగా మెరుగుపడుతుండటం విశేషం.