కాంగ్రెస్ నేత కీర్తి ఆజాద్‌కు Trinamool Congress తీర్థం ?

ABN , First Publish Date - 2021-11-23T18:27:08+05:30 IST

కాంగ్రెస్ పార్టీ నేత కీర్తి ఆజాద్ మమతాబెనర్జీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి...

కాంగ్రెస్ నేత కీర్తి ఆజాద్‌కు Trinamool Congress తీర్థం ?

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేత కీర్తి ఆజాద్ మమతాబెనర్జీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.1983 క్రికెట్ వరల్డ్ కంప్ విన్నింగ్ జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్ బీహార్ రాష్ట్రంలోని దర్బంగా స్థానం నుంచి మూడు సార్లు ఎంపీగా పనిచేశారు. కీర్తి ఆజాద్ బీహార్ మాజీ సీఎం భగత్ ఝా ఆజాద్ కుమారుడు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ధన్ బాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు బీజేపీలో పనిచేసిన కీర్తి ఆజాద్ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ లో మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారంటూ బహిరంగంగా ఆరోపణలు చేయడంతో ఆ పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది.


 కీర్తి ఆజాద్ తోపాటు కాంగ్ర్రెస్ పార్టీ మాజీ నేత అశోక్ తన్వర్ కూడా టీఎంసీలో చేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి.మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ నేతలు టీఎంసీలో చేరుతుండటంతో ఆ పార్టీ బలోపేతం అవుతోంది. ఇటీవల గోవాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా టీఎంసీ తీర్థం స్వీకరించారు.


Updated Date - 2021-11-23T18:27:08+05:30 IST