Rajya Sabha Elections 2022 : రాజస్థాన్ ఫలితాలు వెల్లడి.. కాంగ్రెస్ 3, బీజేపీ 1 గెలుపు
ABN , First Publish Date - 2022-06-11T02:10:47+05:30 IST
Rajya Sabha Elections 2022లో భాగంగా 4 రాష్ట్రాల్లో 16 సీట్లకు నేడు(శుక్రవారం) జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.
న్యూఢిల్లీ : Rajya Sabha Elections 2022లో భాగంగా 4 రాష్ట్రాల్లో 16 సీట్లకు నేడు(శుక్రవారం) జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్ ఫలితాలు ప్రకటించగా ఆ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ 3 సీట్లను గెలుపొందింది. విపక్ష బీజేపీకి కేవలం 1 సీటు మాత్రమే దక్కింది. క్రాస్ ఓటింగ్పై నమ్మకం పెట్టుకున్న జీ మీడియా అధినేత సుభాష్ చంద్రకు నిరాశే ఎదురైంది. ఆయన ఓడిపోయారు.రాజస్థాన్ కాంగ్రెస్ అభ్యర్థులు ముకుల్ వాస్నిక్, రణ్దీప్ సుర్జేవాలాలకు అధిక ఓట్లు లభించాయి. ఫలితంగా బీజేపీ అభ్యర్థి ఘన్శ్యామ్ తివారీతోపాటు బీజేపీ బలపరిచిన జీ మీడియా చైర్మన్ సుభాష్ చంద్ర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ బరిలో నిలిపిన అభ్యర్థులందరూ గెలిచినట్టయింది.
క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో రాజస్థాన్ ఎన్నికల ఫలితాలను రాజకీయ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. కాగా కీలకమైన మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల రాజ్యసభ ఫలితాలు వెలువడాల్సి ఉంది.