బూతుల పురాణం ఆపి.. ప్రజల కోసం నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలి: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-10-01T23:35:02+05:30 IST

బూతుల పురాణం ఆపి.. ప్రజల కోసం నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలి: తులసిరెడ్డి

బూతుల పురాణం ఆపి.. ప్రజల కోసం నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలి: తులసిరెడ్డి

కడప: ఏపీ రాష్ట్రంలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య ఇటీవల బూతుల పురాణం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలను ఒలంపిక్స్‌లో బూతు ఆటలు ఆడితే, వైసీపీకి స్వర్ణపథకం, జనసేనకి రజత పథకాలు వస్తాయని తులసిరెడ్డి అన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలతో అల్లాడుతుంటే.. ఈ రెండు పార్టీల నాయకులు పోటీ పడి బూతులు తిట్టుకోవడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా పనికిరాని మాటలు మాని ప్రజల కోసం నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలని తులసిరెడ్డి సూచించారు.

Updated Date - 2021-10-01T23:35:02+05:30 IST