కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2021-09-05T00:38:22+05:30 IST
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందనంత దూరంలో ఉంటున్నాయని, కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు
వరంగల్: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందనంత దూరంలో ఉంటున్నాయని, కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఒక్క హుజురాబాద్కు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల దళితులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధుతో పాటు అన్నివర్గాల ప్రజలకు రూ.10 లక్షలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత పథకాలతో పాటు మరికొన్ని కొత్త పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అందరూ అండగా ఉండాలని, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తోందని జగ్గారెడ్డి ప్రకటించారు.