టీ కాంగ్రెస్ దేశంలో నెంబర్‌వన్‌గా నిలిసింది: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-03-04T23:28:34+05:30 IST

రాష్ట్రంలో 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి టీ కాంగ్రెస్ దేశంలో నెంబర్‌వన్‌గా నిలిసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.

టీ కాంగ్రెస్ దేశంలో నెంబర్‌వన్‌గా నిలిసింది: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి టీ కాంగ్రెస్ దేశంలో నెంబర్‌వన్‌గా నిలిసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ్యత్వం చేసినవారికి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఇన్సూరెన్స్ పర్యవేక్షణ కోసం పార్టీలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌కి భయపడి వ్యూహకర్త పీకేను తెచ్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనడానికి ఇదే తార్కాణమన్నారు. కేసీఆర్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Updated Date - 2022-03-04T23:28:34+05:30 IST