పేదలకు ఉచిత వైద్యం అందించిన ఘనత కాంగ్రె్సకే దక్కింది
ABN , First Publish Date - 2022-08-14T05:15:00+05:30 IST
పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఉచితంగా వైద్యం అం దించిన ఘనత కాంగ్రెస్ పాలనకే దక్కిందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్రమే్షరెడ్డి అన్నారు.
సూర్యాపేటటౌన్, ఆగస్టు 13: పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఉచితంగా వైద్యం అం దించిన ఘనత కాంగ్రెస్ పాలనకే దక్కిందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్రమే్షరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని 43వవార్డులో ఇటీవల అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న పెండ్ర వెంకన్నకు శనివారం ఆర్థికసాయం అందజేసి, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటనలకే పరిమతమైందే తప్ప ఆచరణలో పూర్తిగా విఫలమైందన్నారు. పూర్తిస్థాయిలో ఉచిత, విద్య, ఉచిత, వైద్యం రాష్ట్రంలో అమలుకావడంలేదని ఆవేదనవ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నామా అరుణప్రవీణ్, వల్థాస్ దేవేందర్, నాయకులు పాల్గొన్నారు.