జమ్మికుంటలో కాంగ్రెస్ వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-06-14T22:20:43+05:30 IST
జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న
కరీంనగర్: జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేల ఫోటోలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యేలు రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలతో పాటు ఆయా స్థానాల్లో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.