హుజురాబాద్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ వేట

ABN , First Publish Date - 2021-07-27T23:19:16+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థి ఎంపిక కోసం ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఎలక్షన్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ

హుజురాబాద్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ వేట

హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థి ఎంపిక కోసం ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఎలక్షన్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలు పెట్టి పల్లెపల్లె చుట్టేస్తున్నారు. అటు టీఆర్ఎస్ కూడా సామాజిక వర్గాల వారిగా ఓటర్లకు గాలం వేసే ఎత్తుగడలు అమలు చేస్తోంది. ఈ విషయంలో కొంత వెనకబడ్డ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే వేగం పెంచుతోంది. తెలంగాణ అవిర్భావం తర్వాత వచ్చిన ఎన్నికలేవి కాంగ్రెస్‌కు కలిసి రాలేదు. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కూడా ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఓటములన్నీ అప్పటి పీసీసీ అధ్యక్షుడి ఖాతాలో పడిపోయాయి. అయితే ఇప్పుడు టీపీసీసీకి కొత్త టీం వచ్చింది. ఈ టీంకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఛాలెంజ్‌గా మారింది. 

Updated Date - 2021-07-27T23:19:16+05:30 IST