కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ చేస్తాం

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ చేస్తాం

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ చేస్తాం
మోమిన్‌కలాన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ప్రసాద్‌కుమార్‌

  • మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌

ధారూరు, జూలై 3: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో  రూ.రెండు లక్షల పంటల రుణమాఫీ చేస్తామని, పట్టాదారులతో పాటు కౌలు రైతులకూ రైతుబంధు అందజేస్తామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. మండల పరిధిలోని మోమిన్‌కలాన్‌ గ్రామంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించిన అన ంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎరువులు, విత్తనాల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచి రైతులను దగా చేసిందని ఆయన ధ్వజమెత్తారు. రైతుల గురించే ఆలోచించేది ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అన్నారు. తమ ప్రభుత్వ ఏర్పడిన త ర్వాత  పంటలకు గిట్టుబాటు ధర అందజేస్తామని, వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తామని ప్రసాద్‌కుమార్‌ హామీ ఇచ్చారు. నకిలీ పాస్‌పోర్టుల బ్రోకర్‌ ముఖ్యమం త్రి కావటం మన దురదృష్టమని ఆయన అన్నారు. రాష్ట్రంలో పాలన అధోగతి పాలయిందని, బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవ టం లేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప్రతీ వస్తువు ధరలు పెంచి ప్రజలను దోపిడి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పి.రఘువీరారెడ్డి, మాజీ జడ్పీటీసీ పి.రాములు, సర్పంచ్‌ పాండునాయక్‌, నాయకులు బాలవర్ధన్‌రెడ్డి, బుజ్జయ్యగౌడ్‌, జొన్నల రవిశంకర్‌, రమేశ్‌కృష్ణ, బాబూమియా, మల్లారెడ్డి, కిరణ్‌, విజయభాస్కర్‌రెడ్డి, రాజ్‌మియా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T05:30:00+05:30 IST