‘మునుగోడులో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయం’

ABN , First Publish Date - 2022-08-19T05:54:04+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని మాజీమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయ కుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.

‘మునుగోడులో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయం’

చౌటుప్పల్‌ టౌన్‌, ఆగస్టు 18: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని మాజీమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయ కుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలో గురువారం జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఈ నెల 20న దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్బంగా నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్‌ జెండాలను ఆవిష్కరణ చేసేందుకు పీసీసీ నిర్ణయించిందని, ఈ కార్యక్రమాలకు గాను ప్రతి గ్రామానికి ఒక రాష్ట్ర ఇంచార్జ్‌ హాజరవుతారని తెలిపారు. కొంత మంది నాయకులు స్వార్థంతో పార్టీ మారినంత మాత్రాన కార్యకర్తలు చెక్కు చెదర లేదని, కార్యకర్తలకు అన్ని విదాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. సమావేశంలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి, డీసీసీ కార్యదర్శి ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ బడు గు మాణిక్యం, సర్పంచ్‌లు చౌట వేణుగోపాల్‌, కొర్పూరి సైదులు, ఉప సర్పంచ్‌ ఎల్లంకి రాఘవేంద్ర, ఐఎన్‌టీయుసీ రాష్ట్ర కార్యదర్శి బోయ రామచంద్రం, నాయకులు ఎస్‌కె జానీబాయి, టి. శ్రీకాంత్‌ గౌడ్‌, సుర్కంటి రవీందర్‌రెడ్డి,  కళ్లెం దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:54:04+05:30 IST