టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఫైర్
ABN , First Publish Date - 2021-03-26T22:49:44+05:30 IST
0 రోజులు నడవాల్సిన బడ్జెట్ సమావేశాలు 6 రోజులే నడిపారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పుబట్టారు.
హైదరాబాద్: 30 రోజులు నడవాల్సిన బడ్జెట్ సమావేశాలు 6 రోజులే నడిపారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పుబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పక్క రాష్ట్రం నీటి దోపిడికి పాల్పడుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర సొమ్మును కాంట్రాక్టులకు దోచి పెడుతున్నారుని దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాలు.. భజన మండలిగా నడిచిందని ఎమ్మెల్యే శ్రీధర్బాబు ఆక్షేపించారు. సభలో అధికార పార్టీ చెప్పిందే వినేలా నడిపారని, ఆర్డీఎస్, సంగమేశ్వర ప్రాజెక్టులపై ప్రశ్నిస్తే సమాధానం లేదని శ్రీధర్బాబు చెప్పారు. సర్పంచ్లకు నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, భూనిర్వాసితులను పోలీసులతో వేధిస్తున్నారని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి మండిపడ్డారు.