బీజేపీ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్ ఆందోళన

ABN , First Publish Date - 2022-07-06T22:51:14+05:30 IST

కేంద్రం వంటగ్యాస్ రేట్లు పెంచడాన్ని నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

బీజేపీ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్ ఆందోళన

హైదరాబాద్: కేంద్రం వంటగ్యాస్ రేట్లు పెంచడాన్ని నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.గాంధీభవన్ మెట్రో స్టేషన్ వద్ద కేంద్రం దిష్టిబొమ్మను మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. నరేంద్ర మోదీ డౌన్డౌన్ అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై భారం మోగుతున్నాయంటూ విమర్శించారు.హైదరాబాద్ కు వచ్చి తెలంగాణ ప్రజలకు మోడీ గ్యాస్ రేట్లు గిఫ్ట్ గా ఇచ్చాడంటూ విమర్శించారు. కాగా కాంగ్రెస్ నిరసనలను బీజేపీ మహిళా మోర్చా తిప్పుకొట్టింది. కాంగ్రెస్ కు పోటీగా వారు ఆందోళన చేశారు.కాంగ్రెస్ డౌన్ డౌన్ సోనియాగాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.పోటాపోటీ నినాదాలతోగాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఏరియా దద్దరిల్లిపోయింది.మహిళా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి తరలించారు.

Updated Date - 2022-07-06T22:51:14+05:30 IST