నాగాలాండ్‌కు కాంగ్రెస్ ప్రతినిధి బృందం

ABN , First Publish Date - 2021-12-06T23:34:25+05:30 IST

నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో నలుగురు సభ్యుల కాంగ్రెస్ ప్రతినిధుల బృందం..

నాగాలాండ్‌కు కాంగ్రెస్ ప్రతినిధి బృందం

న్యూఢిల్లీ: నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో నలుగురు సభ్యుల కాంగ్రెస్ ప్రతినిధుల బృందం పర్యటించనుంది. సైన్యం జరిపిన కాల్పుల్లో అమాయక పౌరులు మరణించడం, తదనంతరం హింస చేలరేగిన నేపథ్యంలో అక్కడ పర్యటిచేందుకు నలుగురు సభ్యుల కాంగ్రెస్ ప్రతినిధుల బృందాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏర్పాటు చేసినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. మాన్ జిల్లాలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం పర్యటించి వారం రోజుల్లోపు పార్టీ అధ్యక్షురాలికి నివేదిక అందజేయనున్నట్టు తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సిగ్, ఏసీసీసీ నాగాలాండ్ ఇన్‌చార్జి డాక్టర్ అజాయ్ కుమార్, పార్లమెంటు సభ్యులు గౌరవ్ గొగోయ్, ఆంటో ఆంటొనీ ఈ ప్రతినిధి బృందంలో సభ్యులుగా ఉన్నారు.

Updated Date - 2021-12-06T23:34:25+05:30 IST