ఉప ఎన్నికలపై ఈసీని కలిసిన కాంగ్రెస్ బృందం

ABN , First Publish Date - 2021-10-27T00:39:15+05:30 IST

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ ‘‘ఓటర్లను బెదిరిస్తున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు..

ఉప ఎన్నికలపై ఈసీని కలిసిన కాంగ్రెస్ బృందం

న్యూఢిల్లీ: అస్సాంలో ప్రజాస్వామ్యం ధ్వంసం అయిందంటూ కాంగ్రెస్ పార్టీ అస్సాం ఇంచార్జీ జితేంద్ర సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం ఎన్నికల సంఘాన్ని మంగళవారం ఆశ్రయించింది. అస్సాంలో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనేక ప్రలోభాలాకు పాల్పడుతున్నారని, ఎన్నికల్లో డబ్బులు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు.


ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ ‘‘ఓటర్లను బెదిరిస్తున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో అనేద తప్పిదాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ధన ప్రవాహంపై వెంటనే కేసు నమోదు చేసి, ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిశేధించాలని ఎన్నికల సంఘానికి విన్నవించాం’’ అని అన్నారు.

Updated Date - 2021-10-27T00:39:15+05:30 IST