దుబ్బాక ఉప ఎన్నికపై కాంగ్రెస్ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-08-14T21:21:19+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం...

దుబ్బాక ఉప ఎన్నికపై కాంగ్రెస్ కీలక ప్రకటన

హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో పోటీపై ఎవరేం మాట్లాడినా అది వారి వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ కార్యకర్తలు సిద్ధం కావాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. త్వరలో దుబ్బాక నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.


దుబ్బాక నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యం కారణంగా కన్నుమూయడంతో ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే బీజేపీ కూడా అభ్యర్థిని నిలపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకే ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది.

Updated Date - 2020-08-14T21:21:19+05:30 IST