ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
ABN , First Publish Date - 2020-09-30T15:34:56+05:30 IST
కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశంకానుంది.
హైదరాబాద్: కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశంకానుంది. పార్టీ సీనియర్ నేతలతో టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశంకానుంది. జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు బ్యాలెట్ , ఈవీఎం వివాదంపై కోర్ కమిటీ చర్చించనుంది. సమావేశం అనంతరం కాంగ్రెస్ అభిప్రాయాన్ని ఎన్నికల సంఘానికి టీపీసీసీ తెలుపనుంది. బ్యాలెట్ ద్వారానా లేక ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలా అనే దానిపై కాంగ్రెస్ ఇప్పటికే ఆన్లైన్ సర్వేను ప్రారంభించిన విషయం తెలిసిందే.