ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ

ABN , First Publish Date - 2020-09-30T15:34:56+05:30 IST

కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశంకానుంది.

ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ

హైదరాబాద్: కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశంకానుంది. పార్టీ సీనియర్ నేతలతో టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశంకానుంది. జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు బ్యాలెట్ , ఈవీఎం వివాదంపై కోర్ కమిటీ చర్చించనుంది. సమావేశం అనంతరం కాంగ్రెస్ అభిప్రాయాన్ని ఎన్నికల సంఘానికి టీపీసీసీ తెలుపనుంది. బ్యాలెట్ ద్వారానా లేక ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలా అనే దానిపై  కాంగ్రెస్ ఇప్పటికే ఆన్‌లైన్ సర్వేను ప్రారంభించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-09-30T15:34:56+05:30 IST