75 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పోటీ
ABN , First Publish Date - 2021-03-04T06:47:36+05:30 IST
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 75 వార్డుల్లో పోటీలో ఉన్నారు.
విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 75 వార్డుల్లో పోటీలో ఉన్నారు. మొత్తం 98 వార్డుల్లోను అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ...ఐదు వార్డుల్లో స్వీయ తప్పిదాల వల్ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక, అధికార పార్టీ ఒత్తిళ్లతో కొన్నిచోట్ల అభ్యర్థులు చివరి నిమిషంలో బరి నుంచి తప్పుకున్నట్టు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. పోటీలో వున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు, జీఏ నారాయణరావు తదితరులు గురువారం నగర పార్టీ కార్యాలయంలో విడుదల చేయనున్నారు.