బీజేపీ ఎక్కడుందో తెలియదు: సీఎం ఎద్దేవా

ABN , First Publish Date - 2020-10-20T11:35:15+05:30 IST

పుదుచ్చేరి రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందో తెలియడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన ఆయన... మెడికల్‌ కోర్సులో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడం చారిత్రాత్మక ద్రోహం అని, కేంద్రంలో అధికారంలో

బీజేపీ ఎక్కడుందో తెలియదు: సీఎం ఎద్దేవా

చెన్నై :  పుదుచ్చేరి రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందో తెలియడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన ఆయన... మెడికల్‌ కోర్సులో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడం చారిత్రాత్మక ద్రోహం అని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజల సమస్యలు తెలియవని విమర్శించారు. బీజేపీ బలం, బలహీనత రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. పుదుచ్చేరి నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు నడపడంపై చర్చలు జరుగుతున్నాయని, కరోనా ప్రభావాన్ని తగ్గించేలా తమ ప్రభుత్వం నివారణ చర్యలను పటిష్ఠంగా అమలు చేస్తోందన్నారు. మృతుల సంఖ్య తక్కువగా ఉన్నందు వల్ల ప్రజలు నిర్లక్ష్యం చూపకుండా ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం నారాయణస్వామి కోరారు.

Updated Date - 2020-10-20T11:35:15+05:30 IST