ఎన్నికల్లో ఓటమి.. గుండె పోటుతో కాంగ్రెస్ నేత మృతి

ABN , First Publish Date - 2022-07-18T02:37:08+05:30 IST

మధ్యప్రదేశ్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే క్రమంలో మొదట కాంగ్రెస్ కాస్త..

ఎన్నికల్లో ఓటమి.. గుండె పోటుతో కాంగ్రెస్ నేత మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే క్రమంలో మొదట కాంగ్రెస్ కాస్త ఆధిపత్యాన్ని చూపించినప్పటికీ.. చివరి ఫలితాలు విడుదలయ్యేనాటికి ఆశించిన ఫలితాల్ని అందుకోలేకపోయింది. కాగా, ఈ ఎన్నికల్లో ఓడిన ఓ వ్యక్తి గుండె పోటుతో మరణించారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. రాష్ట్రంలోని రెవా మున్సిపాలిటీలోని వార్డ్ నెంబర్ 9 నుంచి పోటీ చేసిన హరినారాయణ్ గుప్త, 14 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయనపై అఖిలేష్ గుప్త అనే స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితం చూసిన అనంతరం హరినారాయణ్ గుండెపోటుతో మరణించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Updated Date - 2022-07-18T02:37:08+05:30 IST