మతం మత్తు ఎక్కించి బీజేపీ ఓట్లు పొందుతోంది: మధుయాష్కీ
ABN , First Publish Date - 2020-12-05T21:37:49+05:30 IST
మతం మత్తు ఎక్కించి బీజేపీ ఓట్లు పొందుతోంది: మధుయాష్కీ
హైదరాబాద్: కాంగ్రెస్కు వరుస ఓటములు బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చినా ఓటమికి కారణాల మీద సమీక్ష చేసుకుంటామని తెలిపారు. మతం మత్తు ఎక్కించి బీజేపీ ఓట్లు పొందుతోందన్నారు. పీసీసీ అధ్యక్షునిపై సోనియా నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చిన అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.