కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి: మంత్రి

ABN , First Publish Date - 2020-10-19T03:00:21+05:30 IST

కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి: మంత్రి

కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి: మంత్రి

జగిత్యాల: కాంగ్రెస్, బీజేపీ నేతలపై తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు రైతుల ముసుగులో ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఇంటిపై దాడి చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. రైతుల ముసుగులో రాజకీయం చేయడం సరికాదని కొప్పుల అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు చేసిందేమిటో చర్చకు రావాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

Updated Date - 2020-10-19T03:00:21+05:30 IST