జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్: ఎంపీ కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2021-06-03T21:42:30+05:30 IST
రాష్ట్రంలోని జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
యాదాద్రి: రాష్ట్రంలోని జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. భువనగిరిలో కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ గిరిబాబు కుటుంబానికి లక్ష ఆర్ధిక సాయాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.