వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోటి సంతకాల సేకరణ
ABN , First Publish Date - 2020-10-25T07:09:43+05:30 IST
దేశానికి వెన్నెముక్క అయిన రైతు నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలో కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్చార్జ్ బోడా వెంకట్, రూరల్లో పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాలేపల్లి మురళిధర్రావు ఆధ్వర్యంలో శనివారం కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. తొలుతగా నిరసన ప్రదర్శన చేశారు.
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 24: దేశానికి వెన్నెముక్క అయిన రైతు నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలో కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్చార్జ్ బోడా వెంకట్, రూరల్లో పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాలేపల్లి మురళిధర్రావు ఆధ్వర్యంలో శనివారం కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. తొలుతగా నిరసన ప్రదర్శన చేశారు. ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ఎన్వీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మార్టిన్ లూధర్, కార్యదర్శి ముళ్ల మాధవ్, ఆకుల భాగ్యలక్ష్మీ, బెజవాడ రంగ, గోలి రవి, పిసపాటి రవీంద్ర శ్రీనివాస్, లోడా అప్పారావు, గట్టిన నవతారకేష్, పిల్లా సుబ్బారెడ్డి బాబి పాల్గొన్నారు.