అవినీతి మచ్చలేని జానారెడ్డి గెలవడం ఖాయం: ఉత్తమ్
ABN , First Publish Date - 2021-04-14T17:13:43+05:30 IST
అవినీతి మచ్చలేని జానారెడ్డి గెలవడం ఖాయం: ఉత్తమ్
నల్గొండ: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని ప్రధానే చెబుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. డబ్బు, మద్యంతో లక్షల మందితో సభ పెట్టి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజా ఆరోగ్యంపై పెట్టిన కరోనా నిబంధనలు సీఎం సభకు వర్తించవా? అని ఆయన ప్రశ్నించారు. ఓటమి భయంతోనే టీఆరెఎస్ నాయకులు పోలీసులచే కాంగ్రెస్ నాయకులను అణచివేతకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి మచ్చలేని జానారెడ్డి గెలవడం ఖాయమన్నారు.