వీరుడా అభివందనం....

ABN , First Publish Date - 2022-05-25T05:06:52+05:30 IST

మహరాష్ట్ర నాసిక్‌ సమీప దేవలాలీ బేస్‌ కంటోన్మెంట్‌లో హ వాల్‌దార్‌ నల్ల బాలకృష్ణ(42) ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వీరుడా అభివందనం....
బాలకృష్ణ మృతదేహం వద్ద అర్మీ అధికారుల వందనం

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతి

బద్వేలు రూరల్‌, మే 24: మహరాష్ట్ర నాసిక్‌ సమీప దేవలాలీ బేస్‌ కంటోన్మెంట్‌లో హ వాల్‌దార్‌ నల్ల బాలకృష్ణ(42) ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే స్థానిక వెంకటయ్యనగర్‌ వాసి బాలకృష్ణ 22 ఏళ్ల కిందట ఆర్మీలో చేరాడు. ప్రస్తు తం దేవలాలీ బేస్‌ కంటోన్మెంట్‌లో హవాల్‌దార్‌గా పని చేస్తున్న బాలకృష్ణ ఆదివారం అధికారుల అనుమతితో మోటార్‌ బైక్‌పై నాసిక్‌ బయలుదేరారు.

ఈ క్రమంలో మోటార్‌బైకు అదుపు తప్పి కింద పడగా బాలకృష్ణపై మరో లారీ ఎక్కి వెళ్లడంతో తీవ్ర గాయా లపాలయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆర్మీ క ంటోన్మెంట్‌కు సమాచారం అందించడంతో అక్కడకి చేరుకున్న ఆర్మీ అధికారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందిన బాలకృష్ణ మృతదేహాన్ని ఆర్మీ అధికారులు మం గళవారం వెంకటయ్యనగర్‌లోని ఆయన స్వగృహానికి చేర్చారు. మృతుడు బాలకృష్ణకు భార్య అర్చన, పల్లవి, యోగేంద్ర ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. మరో నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ పొంది ఇంటికి రానున్న బాలకృష్ణ శవమై రావడంతో కుటుంబ సభ్యులు బంధువులు శోకసంద్రంలో మునిగారు.

Updated Date - 2022-05-25T05:06:52+05:30 IST