బాక్సర్ నిఖత్ జరీన్కు ఘనస్వాగతం
ABN , First Publish Date - 2022-08-15T05:39:15+05:30 IST
బాక్సర్ నిఖత్ జరీన్కు ఘనస్వాగతం
శంషాబాద్, ఆగస్టు 14: ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో బాక్సింగ్లో మహిళల 50కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్కు ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో క్రీడాభిమానులు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ఆమె శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాగా అరైవైల్స్, ఎయిర్పోర్టు విలేజ్లో క్రీడాభిమానులు స్వాగతం పలికారు. తాను సాధించిన గోల్డ్ మెడల్ను నిఖత్ జరీన్ అభిమానులకు చూపుతూ ముద్దుపెట్టుకున్నారు. ఎయిర్పోర్టుకు ఆమె తండ్రి ఎండీ.జమీల్అహ్మద్ వచ్చారు. నగరంలోని మణికొండలో జరీన్ కుటుంబం నివసిస్తుంది. ఆ ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో వచ్చిన క్రీడాభిమానులు జరీన్కు స్వాగతం పలికారు.