బాబ్రీ మసీదు తీర్పుపై హర్షాతిరేకాలు

ABN , First Publish Date - 2020-10-02T08:19:32+05:30 IST

బాబ్రీ మసీదు తీర్పుపై బీజేపీ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

బాబ్రీ మసీదు తీర్పుపై హర్షాతిరేకాలు

కరప, అక్టోబరు 1: బాబ్రీ మసీదు తీర్పుపై బీజేపీ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నడకుదురులో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ అగ్రనేతలపై అక్రమంగా పెట్టిన కేసును కొట్టివేస్తూ సమున్నత న్యాయస్థానం తీర్పునివ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రీయ హిందూ చైతన్యసదస్సు అధ్యక్షుడు పడాల రఘు, జిల్లా కిసాన్‌మోర్చా అధ్యక్షుడు పెండెం బాబ్జీ, పుట్టా వీరప్రసాద్‌గాంధీ పాల్గొన్నారు.


Updated Date - 2020-10-02T08:19:32+05:30 IST