కాంగ్రెస్తోనే సమగ్రాభివృద్ధి సాధ్యం
ABN , First Publish Date - 2022-08-11T05:51:42+05:30 IST
గొల్లప్రోలు, ఆగస్టు 10: రాష్ట్రం, దేశం అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధిని సాధించడం కాంగ్రెస్తోనే సాధ్యమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా, సాతం త్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా గొల్లప్రోలులో కాంగ్రెస్ నాయకులు బుధవారం పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రను ప్రారంభించిన పాం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు పాండురంగారావు
గొల్లప్రోలు, ఆగస్టు 10: రాష్ట్రం, దేశం అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధిని సాధించడం కాంగ్రెస్తోనే సాధ్యమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా, సాతం త్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా గొల్లప్రోలులో కాంగ్రెస్ నాయకులు బుధవారం పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రను ప్రారంభించిన పాండురంగారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరితో అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. పాదయాత్రలో పీసీసీ సభ్యుడు, పిఠాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మేడిది శ్రీనివాసరావు, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు పార్టీ ఇన్చా ర్జిలు నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఉమ్మిడి వెంకట్రావు, మాదేపల్లి సత్యానందరావు (చిట్టిబాబు), మట్టా ప్రసాద్, మేడిశెట్టి నారయ్య, అప్పారెడ్డి, పులగల రాజు తదితరులు పాల్గొన్నారు.