హైవేపై రద్దీ
ABN , First Publish Date - 2020-10-24T11:36:40+05:30 IST
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం దసరా పండుగ రద్దీ ఏర్పడింది. దసరా నేపథ్యంలో అంతా స్వగ్రామాల బాటపట్టడంతో జాతీయ రహదారి వాహనాలతో నిండినది
చౌటుప్పల్ రూరల్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం దసరా పండుగ రద్దీ ఏర్పడింది. దసరా నేపథ్యంలో అంతా స్వగ్రామాల బాటపట్టడంతో జాతీయ రహదారి వాహనాలతో నిండినది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేటు వద్ద ఫాస్టాగ్ నుంచి వాహనాలు నేరుగా వెళ్లగా, క్యాష్కౌంటర్ వద్ద మాత్రం బారులు తీరాయి. హ్యాండ్ మిషన్ద్వారా టోల్ఫీజు వసూలు చేసి ఎప్పటికప్పుడు వాహనాలను పంపుతున్నారు. మొత్తం 16 గేట్లకు 10 గేట్ల నుంచి విజయవాడవైపు వాహనాలు పంపించారు. సాధారణ రోజుల్లో 25వేల వాహనాల రాకపోకలు ఉంటుండగా, శుక్రవారం ఆదనంగా 3వేల వాహనాలు వెళ్లాయని జీఎంఆర్ సిబ్బంది తెలిపారు.