హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై రద్దీ

ABN , First Publish Date - 2021-05-14T08:33:33+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రహదారిపై వాహనాలు బారులు తీరాయి. అటు విజయవాడ వైపు, ఇటు

హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై రద్దీ

చౌటుప్పల్‌ రూరల్‌/కోదాడ రూరల్‌, మే 13: లాక్‌డౌన్‌ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రహదారిపై వాహనాలు బారులు తీరాయి. అటు విజయవాడ వైపు, ఇటు హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలతో జాతీయ రహదారి సందడిగా మారింది. పట్టణాల్లో వాహనాల రద్దీతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని తంగడపల్లి చౌరస్తా వద్ద అర గంట పాటు ట్రాఫిక్‌ జాం కావడంతో, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పంతంగి టోల్‌ గేట్‌ వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఉదయం 10 గంటల అనంతరం జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. పోలీసులు వాహనాలను తనిఖీ చేసి అనుమతించారు. ఈ-పాస్‌ అనుమతి తీసుకున్నవారు, అంబులెన్స్‌లకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వాహనాల సంఖ్య తగ్గింది.

Updated Date - 2021-05-14T08:33:33+05:30 IST