కరోనాతో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిస్థితిగా విషమం: వైద్యులు

ABN , First Publish Date - 2020-09-24T02:02:22+05:30 IST

కరోనాతో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిస్థితిగా విషమం: వైద్యులు

కరోనాతో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిస్థితిగా విషమం: వైద్యులు

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. కరోనాతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బి. నారాయణరావు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి యాజమాన్యం సెప్టెంబర్ బుధవారం 23న తెలిపింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో రావును సెప్టెంబర్ 1న మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించినట్లు ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మనీష్ రాయ్ తెలిపారు. ప్రస్తుతం అతను వెంటిలేటర్, డయాలసిస్, బహుళ-అవయవ వైఫల్యంతో చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్నాడని డాక్టర్ రాయ్ చెప్పారు. నిపుణుల వైద్యుల మల్టీ-డిసిప్లినరీ బృందం తన చికిత్సలో పాల్గొని పరిస్థితిని పర్యవేక్షిస్తుందని ఆయన అన్నారు

Updated Date - 2020-09-24T02:02:22+05:30 IST