వ్యాపారుల మధ్య గొడవ
ABN , First Publish Date - 2020-05-11T11:37:02+05:30 IST
పట్టణంలోని కూరగాయల మార్కెట్ వీధిలో ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో వస్త్ర వ్యాపారులు, ఇతర వ్యాపారుల మధ్య ..
జమ్మలమడుగు రూరల్, మే 10: పట్టణంలోని కూరగాయల మార్కెట్ వీధిలో ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో వస్త్ర వ్యాపారులు, ఇతర వ్యాపారుల మధ్య గొడవ జరిగింది. వస్త్ర వ్యాపారులు ఒక ఎలక్ట్రిక్ షాపులో దుస్తులు పెట్టి వ్యాపారం చేస్తున్నారని పక్కన ఉన్న ఇతర వ్యాపారులు ఘర్షణకు దిగారు. పట్టణంలో లాక్డౌన్ పురష్కరించుకుని 144 సెక్షన్, 30 యాక్టు అమలులో ఉండడంతోపాటు ఇరువర్గాలు ప్రధాన రోడ్డులో సుమారు 50 మందికిపైగా గుమికూడడంతో ప్రజలు ఒకింత ఆందోళనకు గురయ్యారు.
వెంటనే విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్ఐ రంగారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్క దిద్దడంతోపాటు గొడవకు కారణమైనవారిని పోలీసు స్టేషన్కు పిలిపించి మందలించి పంపించారు. కాగా ఈ ఘటనపై ఎస్ఐ మాట్లాడుతూ ఘటనా స్థలంలో వ్యాపారం చేసే వ్యక్తిని స్టేషన్కు తీసుకొచ్చామన్నారు. రెండు రోజుల క్రితం హెచ్చరించినా మార్పురాకపోవడంతో కొందరు వ్యాపారులు ఇచ్చినా ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.