వైసీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2021-03-04T05:20:55+05:30 IST

ఎన్నికల్లో చోటు చేసుకున్న చిన్నపాటి సంఘటన చిలికి చిలికి గాలివానలా మారి మంగళవారం రాత్రి షావల్లీ వర్గంపై దాడి చేయడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

వైసీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

నందలూరు, మార్చి3 : మండలంలోని టంగుటూరు పంచాయతీలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన షావల్లీ, వైసీపీ రెబల్‌ అభ్యర్థి ఈశ్వరయ్యలు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో షావల్లీ వర్గానికి చెందిన వ్యక్తి గెలుపొందగా, రెబల్‌గా పోటీచేసిన ఈశ్వరయ్య ఓడిపోయారు. దీంతో ఎన్నికల్లో చోటు చేసుకున్న చిన్నపాటి సంఘటన చిలికి చిలికి గాలివానలా మారి మంగళవారం రాత్రి షావల్లీ వర్గంపై దాడి చేయడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఈశ్వరయ్య వర్గానికి చెందిన నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-03-04T05:20:55+05:30 IST