మిస్సైల్‌ టెక్నాలజీపై సదస్సు

ABN , First Publish Date - 2022-07-02T06:26:07+05:30 IST

మిస్సైల్‌ టెక్నాలజీపై తూర్పు నౌకాదళం, ఏపీ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ శుక్రవారం సదస్సు నిర్వహించాయి. దీనికి ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

మిస్సైల్‌ టెక్నాలజీపై సదస్సు
పుస్తకం ఆవిష్కరిస్తున్న మంత్రి అమర్‌. పక్కన నేవీ అధికారులు

విశాఖపట్నం, జులై 1 (ఆంధ్రజ్యోతి): మిస్సైల్‌ టెక్నాలజీపై తూర్పు నౌకాదళం, ఏపీ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ శుక్రవారం సదస్సు నిర్వహించాయి. దీనికి ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తూర్పు నౌకాదళం ప్రధానాఽధికారి వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌ గుప్తా మాట్లాడుతూ దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో 40 యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు, విమానాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. అన్నీ స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందుతున్నాయని, వాటిలో ఉపయోగించే ఆయుధాల తయారీకి ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ సదస్సులో డీఆర్‌డీఓ, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఐటీ, ఏయూ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T06:26:07+05:30 IST