ఏప్రిల్‌కు పూర్తయ్యేలా టెన్త్‌ పరీక్షలు నిర్వహించండి

ABN , First Publish Date - 2021-01-25T06:51:30+05:30 IST

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తయ్యేలా నిర్వహించాలని హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌ డేగల సూచించారు.

ఏప్రిల్‌కు పూర్తయ్యేలా టెన్త్‌ పరీక్షలు నిర్వహించండి

హిందూ ఉపాఽధ్యాయ సమితి


తిరుపతి(విద్య), జనవరి 24: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తయ్యేలా నిర్వహించాలని హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌ డేగల సూచించారు. మార్చి 15 నుంచే రాష్ట్రంలో వేడి ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. మేలో మరింత పెరగనున్న నేపథ్యంలో ఏప్రిల్‌ చివరికంతా పరీక్షలు పూర్తయ్యేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. దేశంలో ప్రస్తుతం హెల్త్‌ ఎమర్జెన్సీ నెలకొని ఉందని.. ఈ తరుణంలో తీవ్ర ఉక్కపోత, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ముందుగా వాతావరణ, వైద్యఆరోగ్యశాఖలను సంప్రదించి పరీక్షల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Updated Date - 2021-01-25T06:51:30+05:30 IST