సమావేశ మందిర నిర్మాణానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-05-17T05:37:34+05:30 IST

సమావేశ మందిర నిర్మాణానికి శంకుస్థాపన

సమావేశ మందిర నిర్మాణానికి శంకుస్థాపన
శంకుస్థాపన చేస్తున్న చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు

మేడ్చల్‌ : మేడ్చల్‌ మున్సిపాలిటీ కౌన్సిల్‌ సభ్యుల సమావేశ మందిర నిర్మాణ పనులకు ఆదివారం చైర్‌పర్సన్‌ మర్రి దీపికనర్సింహారెడ్డి, కౌన్సిలర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు కౌన్సిల్‌ సభ్యుల సమావేశ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధిపరచి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ చీర్ల రమేష్‌, కౌన్సిలర్లు నడికొప్పు ఉమానాగరాజు, జంగా హరికృష్ణయాదవ్‌, తుడుం గణేష్‌, బత్తుల శివకుమార్‌యాదవ్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు నవీన్‌రెడ్డి, నాయకులు మర్రి నర్సింహారెడ్డి, బత్తుల మధుకర్‌యాదవ్‌, సాటే నరేందర్‌, మల్లే్‌షగౌడ్‌, నడికొప్పు నాగరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రాంచందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T05:37:34+05:30 IST