పార్కు నిర్మాణానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2020-08-07T11:19:16+05:30 IST

నెల్లూరులోని 17వ డివిజన్‌ ఆకుతోట దళితవాడలో రూ. 12 లక్షలతో నిర్మించతలపెట్టిన పార్కు పనులకు రూరల్‌ ..

పార్కు నిర్మాణానికి శంకుస్థాపన

నెల్లూరు (రూరల్‌), ఆగస్టు 6 : నెల్లూరులోని 17వ డివిజన్‌ ఆకుతోట దళితవాడలో రూ. 12 లక్షలతో నిర్మించతలపెట్టిన పార్కు పనులకు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, నుడా వీసీ నవ్య గురువారం శంకుస్థాపన చేశారు. నివాసాల మధ్య ఆందమైన పార్కుల వల్ల ఆహ్లాదంతోపాటు ఆరోగ్యం సొంతమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి పార్కులు మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-07T11:19:16+05:30 IST