స్వచ్ఛంద లాక్డౌన్కు తీర్మానం
ABN , First Publish Date - 2020-07-03T10:52:17+05:30 IST
దహెగాం మండల కేంద్రం లో స్వచ్ఛంద లాక్డౌన్కు వ్యాపారులు తీర్మానం చేసి తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్సై లకు గురువారం తీర్మాన ప్రతిని అందజేశారు.
దహెగాం, జూలై2: దహెగాం మండల కేంద్రం లో స్వచ్ఛంద లాక్డౌన్కు వ్యాపారులు తీర్మానం చేసి తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్సై లకు గురువారం తీర్మాన ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు మధ్యాహ్నం 2గంటల వరకే దుకాణాలు తెరవనున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి నట్లయితే మొదటిసారి రూ.1000, రెండోసారి రూ.3000, మూడోసారి రూ.5000 జరిమానా విధించేలా తీర్మానించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు ప్రశాంత్, ప్రకాష్, తిరుపతి, రమేష్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.