ముగిసిన జిల్లా స్థాయి చదరంగం పోటీలు
ABN , First Publish Date - 2022-08-08T05:59:53+05:30 IST
ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ నేతృత్వంలో విశాఖ లయన్స్ క్లబ్, వైశాఖి లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన అండర్-11 బాలుర, బాలికల జిల్లా స్థాయి చదరంగం పోటీలు ఆదివారం ముగిశాయి.
విశాఖపట్నం(స్పోర్ట్సు), ఆగస్టు 7: ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ నేతృత్వంలో విశాఖ లయన్స్ క్లబ్, వైశాఖి లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన అండర్-11 బాలుర, బాలికల జిల్లా స్థాయి చదరంగం పోటీలు ఆదివారం ముగిశాయి. రామ్నగర్ లయన్స్ క్లబ్లో జరిగిన ఈ టోర్నీలో బాలుర విభాగంలో రమణ సిద్ధార్థ(5.5 పాయింట్లు) ప్రథమ స్థానం, అఖిల్ శ్రీప్రసాద్ (5 పాయింట్లు) ద్వితీయ స్థానం సాధించారు. బాలికల విభాగంలో శ్రావ్యశ్రీ భీమరశెట్టి(5 పాయింట్లు), సత్య సాహిత్య లహరి(4 పాయింట్లు) ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచారు. విజేతలు ఈ నెల 21 నుంచి జరిగే రాష్ట్ర స్థాయి టోర్నీలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ కార్యదర్శి మణికంఠరావు తెలిపారు.