కేంద్రం విధానాలపై ఆందోళనలు
ABN , First Publish Date - 2020-09-24T08:07:16+05:30 IST
కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ బుధవారం ఏలేశ్వరంలో ఆల్ ఇండియా సెంట్రల్కౌన్సిల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన
ఏలేశ్వరం, సెప్టెంబరు 23: కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ బుధవారం ఏలేశ్వరంలో ఆల్ ఇండియా సెంట్రల్కౌన్సిల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఏఐసీసీటీయూ కార్మిక సంఘం, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీలకు చెందిన కార్మికులు, కార్యకర్తలు కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ 12 కార్మిక ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా పట్టణ వీధుల్లో ప్రదర్శన, ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐసీసీటీయూ జిల్లా కన్వీనర్ మసకపల్లి ధనబాబు, పందుల శ్రీను, వడియాల అప్పలరాజు, బాలయ్య, గుమ్మడి రాజు, వరలక్ష్మి, పాదాలమ్మ తదితరులు పాల్గొన్నారు.