నేటి నుంచి ఆరోగ్యమిత్రల ఆందోళనలు
ABN , First Publish Date - 2022-08-11T09:11:42+05:30 IST
నేటి నుంచి ఆరోగ్యమిత్రల ఆందోళనలు
అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆరోగ్య మిత్రలకు, ఇతర సిబ్బందికి కేడర్ ఇవ్వడంతో పాటు కనీస వేతనాలు చేయాలని, జీవో 28కి సవరణలు చేయాలని ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం కొంత కాలంగా డిమాండ్ చేస్తోంది. దీనిపై సంఘం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి జిల్లా కో-ఆర్డినేటర్ల కార్యాలయాల ఎదుట బైఠాయించాలని నిర్ణయించింది. అప్రమత్తమైన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు వెంటనే సంఘం నాయకుల్ని చర్చలకు ఆహ్వానించారు.కానీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ఆంగీకరించలేదు. దీంతో ఆందోళన కొనసాగించనున్నారు.