అమరావతే ఆకాంక్ష

ABN , First Publish Date - 2020-04-10T05:30:00+05:30 IST

రాజధాని అమరావతే తమ ఆశ.. ధ్యాస.. ఆకాంక్ష అని రైతులు, మహిళలు చెబుతున్నారు.

అమరావతే ఆకాంక్ష

114వ రోజు కొనసాగిన ఆందోళనలు

వివిధ రూపాల్లో నిరసనలు

ప్రజాభిప్రాయ సేకరణపై మండిపాటు


గుంటూరు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతే తమ ఆశ.. ధ్యాస.. ఆకాంక్ష అని రైతులు, మహిళలు చెబుతున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరు, అనంతవరం, మందడం, రాయపూడి, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, యర్రబాలెం, ఐనవోలు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు. ఇళ్లలోనే కూర్చొని వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారంకు 114వ రోజుకు చేరుకున్నాయి. ఆర్‌5పై రైతులను అభిప్రాయాలు చెప్పాలని ఫోన్ల రావడంతో కరోనా విజృంభించి, లాకౌట్‌ విధించిన పరిస్థితుల్లో ప్రజాభిప్రాయం తీసుకునే పద్ధతి ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేస్తే తమ అభిప్రాయాలు చెప్తామని కొందరు రైతులు అంటున్నారు.


ఇప్పటికే పేదలకు 5వేల ఇళ్లను నిర్మించారు.. వాటిని వెంటనే లబ్ధిదారులని డిమాండ్‌ చేస్తున్నారు.  ఉద్యమంలో భాగంగా రాత్రి 7.30 నుంచి 7.35వరకు ఇళ్లలో విద్యుత్‌ను నిలిపివేసి కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. 29 గ్రామాల కూడళ్లల్లో మహిళలు కొవ్వొత్తులు చేత పూని మానవహారాలుగా ఏర్పడి జై అమరావతి అంటూ నిరసనలు తెలిపారు.  

Updated Date - 2020-04-10T05:30:00+05:30 IST