ఉపాధ్యాయురాలిని బదిలీ చేయొద్దని ఆందోళన
ABN , First Publish Date - 2022-08-06T05:30:00+05:30 IST
చేర్యాల పెద్దమ్మగడ్డ ప్రభుత్వ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలిని బదిలీ చేయకూడదని డిమాండ్ చేస్తూ శనివారం పాఠశాల విద్యార్థులు, ఏఐఎ్సఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
చేర్యాల, ఆగస్టు 6: చేర్యాల పెద్దమ్మగడ్డ ప్రభుత్వ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలిని బదిలీ చేయకూడదని డిమాండ్ చేస్తూ శనివారం పాఠశాల విద్యార్థులు, ఏఐఎ్సఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లని వేణు మాట్లాడుతూ పాఠశాలలో 300మంది విద్యార్థులున్నప్పటికీ హిందీ ఉపాధ్యాయుడు లేకపోగా, ప్రస్తుతం బోధన చేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయురాలిని బదిలీ చేయడం సమంజసం కాదన్నారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలో విద్యార్థులెలా చదువుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఉపాధ్యాయురాలి బదిలీ నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆత్మకూరి హరికృష్ణ, లోకేశ్, రమేశ్, స్వామితి, సాగరిక తదితరులు పాల్గొన్నారు.