ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన

ABN , First Publish Date - 2020-06-02T10:33:07+05:30 IST

అన్నదాత ఆగ్రహించాడు.. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రోడ్డెక్కాడు. నెల రోజులు గడిచినా వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం పట్ల నిరసన

ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన

దిలావర్‌పూర్‌, జూన్‌ 1: అన్నదాత ఆగ్రహించాడు.. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రోడ్డెక్కాడు. నెల రోజులు గడిచినా వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం వర్షం కురియడంతో మరింత ఆందోళనకు గురైన రైతులు వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 61వ జాతీయ రహదారిపై దిలావర్‌పూర్‌ బస్టాండ్‌ వద్ద రాస్తారోకో చేశారు.


రైతుల ఆందోళనకు కాంగ్రెస్‌ మద్దతు పలికింది. జాతీయ రహదారి పై ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో 40 నిమిషాల పాటు రాకపోకలు స్తంభించాయి. అక్కడి చేరుకున్న ఎస్సై సంజీవ్‌కుమార్‌ రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల హామీ రైతులు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు రాకపోకలను పునరుద్ధరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.ముత్యం రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-02T10:33:07+05:30 IST